Tuesday 12 February 2013

సింహం-నాలుగు ఎద్దులు

ఒకానొక అడవిలో నాలుగు ఎద్దులు ఉండేవి. అవి చాలా బలంగా ఉండేవి. అవి ఒకదానితో ఒకటి చాలా స్నేహంగా కలివిడిగా ఉండేవి. అడవికి రాజైన సింహం కన్ను వాటి మీద పడింది. వాటిని చంపి తినాలని వాటి మీదికి దూకింది.కాని అవి ఒక్కటిగా సింహం పైకి దూకేసరికి వాటిముందు సింహం నిలువలేక పోయింది. ఎద్దుల కొమ్ములు  సింహపు శరీరంలో దిగి చాలా బాధపడింది.సింహం గాయాలను చూసిన నక్క వాటిని విడదీసి చంపటం తీలిక అని సలహ  చెప్పింది.

ఒక రోజు నక్క ఒక్కో ఎద్దు దగ్గరికి వెళ్లి " నిన్ను గురించి మిగతా ఎద్దులు నువ్వు బుద్ధి లేనిదనివి అని, తెలివి తక్కువ దానివని అంటున్నాయని" చెప్పింది. నక్క దొంగ మాటలు ఎద్దులన్ని పూర్తిగా నమ్మి ఒకదానితో ఒకటి పోట్లాడుకున్నాయి. పోట్లాడుకుని విడిపోయాయి కూడా.
ఒంటరిన ఒక్కో ఎద్దుని చంపటం సింహానికి తేలిక పనైంది. రోజూ ఒక్కో ఎద్దుని చంపి తినటం మొదలెట్టింది. అది కడుపార తిని నక్క కి కూడా పెట్టింది.
నీతి:
కలిసిమెలసి వుంటే ఎంతటి కష్టాన్ని అయిన తేలిగ్గా ఎదుర్కొన వచ్చు.
విడిపోవటం వాల్ల ఈ కదా లోని ఎద్దుల్లాగా చాలా నష్టపోవాల్సి వస్తుంది.

No comments:

Post a Comment