Tuesday 12 February 2013

అమ్మ పాటం

ఒకానొక వూరిలో ఒక అమ్మ, ఒక కూతురు వుండేవారు. అమ్మకు చదువు రాదని ఇంట్లోనే వంట చేస్తూ తీరిగ్గా ఉంటుందని ఆ కూతురు భావించేది. ఒకరోజు పరీక్ష లో తక్కువ మార్కులు వచ్చాయని చదవకుండా కూర్చున్న కూతురుకి ఒక పాటం చెప్పాలని అనుకుంది వాళ్ళ అమ్మ. కూతురుని కారోట్, కోడిగుడ్డు, టీ పొడి తీసుకొని రమ్మంది అమ్మ. మూడింటిని మూడు వేరు వేరు పాత్రలలో పోసి, నీళ్ళ లో 20 నిమిషాల పాటు వుడికించమంది. 20 నిమిషాల తర్వాత తన దగ్గరికి ఆ మూడు పాత్రలు తేవలిసిందిగా చెప్పింది. కూతురు అలాగే చేసింది.
మొదట కారోట్ ఉన్న పాత్రని చూసారు అది చాలా మెత్త బడింది.
తరువాత గుడ్డు... గుడ్డులోని సోన అంతా బాగా ఉడికి గట్టిబడింది
తరువాత టీ పొడి... అది వేసిన నీళ్ళు రంగు మారి మంచి వాసన, మంచి రుచిని సంతరించుకున్నాయి.
"ఊ... ఇప్పుడు చెప్తాను" విను అంది అమ్మ, కుతుతూ శ్రద్ధ గా వింటుంది

"మనకి కష్టాలు ఈ వేదినీళ్ళలాగే వస్తాయి... ఒక్కొక్క మనిషి కష్టాలకు ఒక్కోలాగా స్పందిస్తాడు. కారోట్ చూడు కష్టం అనే వేడి నీళ్ళు దానిమీదికి రాంగానే అది మెత్తబడింది. అంటే కష్టం రాంగానే అది కుంగిపోయింది. అదే గుడ్డుని చూడు దాని లోపలి సోనని బయటికి రాకుండా కాపాడటానికి దాని పెంకు గట్టిగా మార్చుకుంది. నీటి వేడి పెరిగే కొలది తనని గట్టిగా మార్చుకుంది. అంటే కష్టాలు వచినప్పుడు తన వాళ్ళను పదిలపరచుకోవటమే కాక తనను కూడా దృడంగా చేసుకుంది. ఇక టీ పొడి తనను హింసించడానికి వచ్చిన వేడి నీటిని మార్చింది తన లక్షణాలను తన పరిమళాన్ని దానికి ఇచ్చింది అంటే, కష్టాన్ని తనకు అనువుగా మార్చుకుంది. ఇప్పుడు చెప్పు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు చెప్పు" అంది అమ్మ
"నిజంగా నువ్వు రోజూ  చేసే చిన్న పనిగా భావించే వంట నుంచి ఇన్ని విషయాల్ని నేర్చుకోవచ్చా అమ్మ" అంటూ తల్లి ని హత్తుకుంది కూతురు.


No comments:

Post a Comment