Sunday 24 February 2013

నిదురించే రాకుమారి

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజుగారికి  ఒక రాకుమార్తె జన్మించింది. రాకుమార్తె జన్మించటంతో రాజ్యమంతా రాకుమార్తెని దీవించడానికి రాజభవనానికి ఆహ్వనించబడ్డారు కాని వారు ఒక మంత్రగత్తెని ఆహ్వానించటం మరిచిపోయారు కోపంతో ఆ మంత్రగాత్తె రాజభవనానికి వచ్చి పాపను పడుకోబెట్టిన వుయ్యలను చేరి ఈమె 16 ఏళ్లకు చనిపోతుందని శపించింది. రాణి నిర్గాంతపోయి మంత్రగాత్తెని శాపం తొలగించమని వేడుకుంది. ఈమెకు 16 ఏట మీ రాజ్యం, రాజభవనం అంతా దీర్గనిద్రలోకి జారుకుంటుంది అని చెప్పింది మంత్రగాత్తె. అయితే ఎప్పుడు మేమంతా నిద్రనుంచి మేలుకుంటామని రాణి ప్రశ్నించగా... మంత్రగాత్తె  రాకుమారిని స్వచ్చంగా ప్రేమించిన వ్యక్తి తనను తాకినప్పుడు అని సమాధానం చెప్పిoది. ఏళ్ళు గడిచాయి రాకుమారి ఆ రాజ్యమంతతికి అందగత్తెగా మారిoది. తన 16వ పుట్టిన రోజున నిద్రలోనికి జారుకుoది. తనతో పాటు తన పరివారం అంతా నిద్రలోనికి జారుకుoది.


చాలా ఏళ్ళు గడిచాయి...నిద్రపోతున్న వారు అలాగే వున్నరు. రాజభవనం పాతది అయింది. చుట్టూ పిచ్చి మొక్కలు బాగా పెరిగి, పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగ మారిపోయింది 
ఒక రోజు ఒక సాహసవంతుడైన యువకుడు ఆ రాజ్యంలో ప్రవెసించాదు. అందరు నిద్రపోతుండటంతో అందరిని తట్టి లేపటం మొదలెట్టాడు, బాకాలు ఊదాడు ఎవ్వరు లేవలేదు, ఎంతకి లేవకపోవటంతో విసిగి రాజభవనం లోపలికి  ప్రవేసించాదు. అక్కడ రాకుమార్తె గదిలో ప్రవెసించాదు. నిద్రపోతున్న రాకుమార్తె చాలా అందంగా వుండటంతో ఆ  యువకుడు ఆమె మీద మనసుపడ్డాడు మెల్లిగా ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. అంతే రాకుమారి కళ్ళు తెరిచింది. రాకుమార్తె పరివారం అంత నిద్రలేచారు. అందరు ఒకరిని ఒకరు ఆశ్చర్యపోయి చూసుకున్నారు, సంతోషంతో వచ్చిన యువకునితో రాకుమార్తె వివాహం జరిపించారు. 

No comments:

Post a Comment