Wednesday 13 February 2013

శిబి చక్రవర్తి

ఆడినమాట నిలబెట్టుకోవడం, ధర్మపధంలో నడవటంలో శిబి చక్రవర్తి మన పురాణాలలో చాలా పేరు పొందిన వ్యక్తి.
ఒకనాడు ఇంద్రుడు డేగ వేషంలో, అగ్ని పావురం వేషం లోకి మారి శిబి చక్రవర్తిని పరిక్షించదలిచారు.

డేగ పావురాన్ని తరుముతూ వచ్చింది, పావురం శిబి చక్రవర్తిని చేరి శరణు అని వేడుకుంది.శిబి చక్రవర్తి పావురానికి అభయమిచ్చాడు.అంతలో డేగ శిబిని చేరి తనకు ఆహరం కావాల్సిన పావురాన్ని తనకు ఇచ్చేయమని అడిగింది.అందుకు శిబి "నేను దానికి అభయమిచ్చాను కావాలంటే నేను దానికి బదులుగా నా దగ్గర వున్న వేరే ఏ ప్రాణిని అడిగినా ఇస్తానని చెప్పాడు. అప్పుడు డేగ "అయితే నీ శరీరం నుంచి పావురం బరువు తూగేంత  మాంసం  ఇవ్వమని కోరింది.
శిబి ఒక కాoటా తెప్పించి అందులో ఒక వైపు పావురాన్ని పెట్టి ఇంకో వైపు తన తోడ చీల్చి మాంసాన్ని వేస్తువచ్చాడు.
పావురం బరువంత మాంసం తీయగానే...ఇంద్రుడు, అగ్ని తమ నిజరూపంలో ప్రత్యక్షమయ్యారు. శిబి తోడ మామూలుగా మారింది. శిబి ధర్మoగా నడుచుకున్నాడని దేవతలు పువ్వుల వర్షం కురిపించారు. శిబి తన రాజ్యాన్ని చాలా కాలం పాలించాడు.

నీతి:
శిబి తన ప్రాణం మీదికి వస్తే, తను ఇచ్చిన మాటను వదులుకోవాచు కదా!.. కాని శిబి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. చిన్న ప్రాణి ఐన పావురం ప్రాణం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అంటే ప్రాణం పోయిన ఆడిన మాట తప్పకుడదు అన్నమాట. 

No comments:

Post a Comment