విద్యార్ధులు అంతా ఆసక్తితో ప్రశ్నాపత్రం చూస్తున్నారు. అందులో మొత్తం పది ప్రశ్నలు ఉన్నాయి. ఆఖరి ప్రశ్న ఇలా వుంది..
"మీ క్లాస్ రూం రోజూ శుబ్రం చేసే పని మనిషి పేరేమి?" అని
ఒక విద్యార్థి లేచి సార్ ఈ ఆఖరి ప్రశ్నకి మార్కులు ఉన్నాయా అన్నాడు
దానికి మాష్టారు "వున్నాయి" అని సమాధానం చెప్పారు
సమాధానాలు రాసాక అన్ని జవాబు పత్రాల్ని తీసుకొని ఆఖరి ప్రశ్నకి ఎవరూ సమాధానం రాయకపోవటం గమనించి ఇలా చెప్పటం ప్రారంబించారు.
" మీకు సంవత్సరం నుంచి మీకోసం పని చేసే మనిషి పేరు తెలీదా ?" అన్నారు.
అందుకు విద్యార్ధులు " ఆమె నల్లగా, పొడవుగా వుంటుంది, ముసలమ్మ అని తెలుసును కానీ ఆమె పేరు తెలియదు "అని సమాధానం ఇచ్చారు.
"చూడండి... మీరు మీ జీవితం లో చాలా మందిని కలుసుకోవాలి, అందులో కొంత మంది గొప్ప వాళ్ళు కొంత మంది చిన్న వాళ్ళు అయివుంటారు. గొప్పవాళ్ళని అందరు అబినందిస్తారు. మీరు నా విద్యార్ధులుగా చెయ్యల్సింది ఏంటి అంటే... అందర్నీ గౌరవించండి, మనస్పూర్తిగా కృతజ్ఞత చెప్పండి, సాటి మనిషి గా అందరిని గుర్తించండి" అని చెప్పారు ఆ మాస్టారు.
ఈ బ్రతుకు పాటం ఒక్క విద్యార్ధిని మార్చినా మంచి పౌరుడు గా మారుతాడు గదా !!....
No comments:
Post a Comment