Wednesday 13 February 2013

ఏడుగురు రాజకుమారులు

నాకు మా అమ్మ ఎక్కువగా చెప్పిన కధ...
అనగనగనగా ఒక రాజుకి  ఏడుగురు కొడుకులున్నారంట...

ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారoట...
అందులో ఒక చేప ఎండలేదు..
అందుకని వాళ్ళు చేపని అడిగారు "చేప చేప ఎందుకు ఎండలేదు?"
చేప అంది "గడ్డి పరక అడ్డువచ్చింది"
"గడ్డి పరక గడ్డి పరక ఎందుకు అడ్డు వచ్చావ్?"
" ఆవు నన్ను మెయ్యలేదు"
"ఆవు ఆవు ఎందుకు మెయ్యలేదు?"
" బుడ్డోడు నన్ను మెయ్యటానికి వదల్లేదు"
" బుడ్డోడ బుడ్డోడ ఎందుకు ఆవుని వదల్లేదు?"
"పాప ఏడ్చింది"
"పాప పాప ఎందుకు ఎడిచావు?"
" చీమ కుట్టింది "
"చీమ చీమ ఎందుకు కుట్టావు?"
" నా బంగారు పుట్టలో వేలు పెడితే నే కుట్టనా..."అంది.

No comments:

Post a Comment