Tuesday 12 February 2013

ముగ్గురు స్నేహితులు

ఒకానొక ఊరిలో ముగ్గురు స్నేహితులు వుండేవారు. వాళ్ళ పేర్లు రాము, సోము, శ్యాము. ఒకరోజు వారికి ఒక పుస్తకం దొరికింది. "మన వూరిపక్కన వుండే కొండ దాటితే మొదట రాగిపురం వుంటుంది అందులో మొత్తం రాగి నాణాలు వుంటాయి, దాని తరువాత వెండినగరం అందులో మొత్తం వెండి నాణాలు వుంటాయి, ఆ తర్వాత బంగారుపురం అందులో మొత్తం బంగారు నాణాలు వుంటాయి, అయితే ఆయా ఊర్లను చేరగలిగిన వారు అందులోని నాణాలను ఎన్నైనా తీసుకోనవచ్చును" అని రాసి వుంది.

ముగ్గురు కొంత ఆహరం నీరు మూటలు కట్టుకుని బయలుదేరారు. కొండ ఎక్కి దిగడానికి చాలా కష్టపడ్డారు కాళ్ళు నొప్పెట్టాయి. రాగిపురం చేరారు. రాము నాకు ఈ రాగి నాణాలు చాలు నేను వీటిని తీసుకుని ఇంటికి వెళతాను అన్నాడు. మిగతా ఇద్దరు నవ్వి నువ్వు కొంచం ఓపిక పడితే వెండినగరం చేరుతాము అన్నారు. రాము వారి మాటలు వినక ఇంటికి వెళ్ళిపోయాడు. రాగి నాణాలు అమ్మి, డబ్బులతో ఆనందం గా ఇల్లు చేరాడు.
మిగతా ఇద్దరు ప్రయాణం కొనసాగించారు. యడారి లాంటి బాటలో ప్రయాణించటం వాల్ల వారి దగ్గరున్న నీళ్ళు అయిపోయాయి. వెండిపురం చేరుకున్నారు. తేచుకున్న ఆహరం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి. శ్యాము  నాకు ఈ వెండి  నాణాలు చాలు నేను వీటిని తీసుకుని ఇంటికి వెళతాను అన్నాడు. సోము నవ్వి నువ్వు కొంచం ఓపిక పడితే బంగారు నగరం చేరుతాము అన్నాడు . శ్యాము వాడి మాటలు వినక ఇంటికి వెళ్ళిపోయాడు. వెండి నాణాలు అమ్మి, డబ్బులతో ఆనందం గా ఇల్లు చేరాడు.
సోము ఒక్కడే ప్రయాణం కొనసాగించాడు నడిచి నడిచి అతని కాళ్ళు సహకరించటం లేదు, ఆహరం లేదు, నీళ్ళు లేవు అయిన బంగారం మీద ఆశ కొలది ప్రయాణం సాగించాడు. మార్గ మాధ్యమం లోనే చనిపోయాడు.
నీతి:
ఆశ కి మితం వుంటుంది, మనకు మించిన ఆశ చివరకు ప్రాణాల్ని కూడా బలిగొంటుంది. చివరవరకు ప్రయత్నించటం మంచిదే కాని సాధ్యాసాధ్యాల్ని కుడా ఆలోచించాలి. సోముకి తెలుసు తను వెళ్ళటం అసాధ్యమని కాని మొండి గా ఆలోచన లేకుండా ప్రయత్నించి బంగపద్దదు.

No comments:

Post a Comment